స్టేడియంలో ఒక్కటైన ప్రేమ జంట..మ్యాక్స్ వెల్ రియాక్షన్ పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

-

ఆసిస్‌, టీమిండియా మధ్య జరిగిన రెండో వన్డే…. ఓ ప్రేమ జంటను కలిపింది. మ్యాచ్‌ మధ్యలో భారత యువకుడు…ఆస్ట్రేలియా అమ్మాయికి లవ్‌ ప్రపోజ్ చేశాడు. ఆ యువతి కూడా ఓకే చెప్పడంతో… స్టేడియం మొత్తం కేరింతలు, చప్పట్లతో మార్మోగింది.

ఆదివారం సిడ్నీ వేదికగా ఆసిస్‌, భారత్ మధ్య రెండో వన్డే జరిగింది. ఆస్ట్రేలియా పెట్టిన భారీ టార్గెట్‌ను చేధించే పనిలో ఉన్నారు మన ఆటగాళ్లు. 20 ఓవర్ల సమయంలో కెప్టెన్ కోహ్లి, శ్రేయస్ బ్యాటింగ్ చేస్తున్నారు. భారత అభిమానుల్లో ఒకటే టెన్షన్‌…ఇదైనా గెలుస్తుందా లేదా అని. ఇంతలోనే ఊహించని సన్నివేశం. ప్రేక్షకుల గ్యాలరీలో అరుదైన సంఘటన జరిగింది.

భారత యువకుడు, ఆస్ట్రేలియా యువతికి ప్రపోజ్ చేశాడు. అది కూడా సినిమా స్టైల్లో. నేనంటే ఇష్టమేనా.. పెళ్లి చేసుకుంటావా అంటూ.. మోకాళ్లపై కూర్చుని ప్రపొజ్ చేశాడు. బాక్స్ ఓపెన్ చేసి రింగ్ చూపించాడు. మనోడి ప్రపోజల్‌కు ఫిదా అయిన ఆ యువతి పొంగిపోయింది. వెంటనే తేరుకుని రింగ్‌ను తీసుకుని ఓకే చెప్పేసింది.

ఈ ప్రేమ జంట ఒక్కటి కావడం.. కెమెరా కంటికి చిక్కింది. స్క్రీన్‌పై గమనించిన ఆసీస్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ వెంటనే రియాక్ట్‌ అయ్యాడు. స్టేడియంలో చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేశాడు. అది కూడా రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. మాక్స్‌వెల్‌ అంతలా రియాక్ట్‌ అవ్వడానికి కారణం ఉందంటున్నారు నెటిజన్లు. అతడి భార్య కూడా ఇండియన్‌ కావడంతో…ఎంకరేజ్ చేశాడంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news