గుడ్‌న్యూస్‌: భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర మాత్రం..

-

పసిడి ధర ప‌రుగులు పెడుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.40,070కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,740కు చేరింది. పసిడి ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. వెండి ధర రూ.450 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు తగ్గింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.38,710కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.37,510కు ఎగసింది. బంగారం ధర పెరిగితే సిల్వర్ మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.450 తగ్గింది. దీంతో ధర రూ.48,500కు క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news