బ్రేకింగ్‌: భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా అదే బాట‌లో..

-

ప‌సిడి ధ‌ర పరుగులు పెడుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.390 పెరిగింది. దీంతో పసిడి ధర రూ.38,320కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 పెరుగుదలతో రూ.41,770కు ఎగసింది. బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 ఎగసింది. దీంతో ధర రూ.39,150కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.40,350కు చేరింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.200 పెరిగింది. దీంతో ధర రూ.49,600కు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news