బ్రేకింగ్‌: షాకిస్తున్న బంగారం ధ‌ర‌.. వెండి కూడా అదే బాట‌లో..

-

నాలుగు రోజులుగా దిగొస్తున్న బంగారం ధ‌ర ఈ రోజు పైపైకి క‌దిలింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర శనివారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.70 పైకి కదిలింది. దీంతో పసిడి ధర రూ.38,090కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. ఈ పసిడి ధర రూ.50 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.41,050కు చేరింది. బంగారం పైపైకి క‌ద‌ల‌డంతో వెండి కూడా అదే బాట‌లో న‌డిచింది. కేజీ వెండి ధర ఈ రోజు ర్యాలీ చేసింది. రూ.100 పెరుగుదలతో రూ.49,400కు ఎగసింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,900కు చేరింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.40,100కు పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.49,400కు ఎగసింది.

Read more RELATED
Recommended to you

Latest news