బ్రేకింగ్‌: భారీగా పైకెగిసిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..!

-

మూడు రోజుల నుంచి త‌గ్గుద‌ల న‌మోదు చేస్తున్న బంగారం ధ‌ర ఈ రోజు భారీగా పైకెగ‌సింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.38,640 నుంచి రూ.38,880కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. రూ.240కు పైకి కదిలింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,150 నుంచి రూ.42,390కు పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,800 నుంచి రూ.49,000కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.40,900కు చేరింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 పెరుగుదలతో రూ.39,700కు ఎగసింది. ఇక బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.200 పెరుగుదలతో రూ.49,000కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news