గుడ్ న్యూస్‌: ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌.. షాకిచ్చిన వెండి..!

-

నిన్న పైకెగ‌సిన బంగారం ధ‌ర ఈ రోజు ప‌త‌న‌మైంది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.100 క్షీణించింది. దీంతో రూ.39,250 నుంచి రూ.39,150కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. రూ.140 తగ్గింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,780 నుంచి రూ.42,640కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,550కు చేరింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 క్షీణించింది. దీంతో ధర రూ.41,150కు తగ్గింది. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.160 తగ్గుదలతో రూ.39,950కు క్షీణించింది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.49,550కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news