మూడు రోజులుగా బంగారం ధరలు పైపైకి…!

-

పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్. మరోసారి పసిడి రేటు బాగా పెరిగి పోయింది. వరుసగా రెండు రోజులు నుండి ధరలు పెరిగాయి అన్న సంగతి తెలిసిందే. అదే విధంగా మరోసారి కూడా ధరలు పెరిగి పోయాయి. దీనితో బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇక బంగారం ధరలు గురించి చూస్తే… హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో రేటు రూ.49,260కు చేరింది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైపైనే వుంది. రూ.240 పెరుగుదలతో రూ.45,150 కి చేరింది.

ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి ఎగసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1870 డాలర్లకు చేరింది. ఇక బంగారం ధరలు పెరగడానికి కారణం ఏమిటి అనేది చూస్తే..

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి ప్రభావం దీని మీద ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news