సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వద్ద భారీ భద్రత…!

-

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం అరెస్ట్ వ్యవహారంలో ఏ పరిణామాలు ఉంటాయి ఏంటీ అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణం రాజుకి నేడు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణా హైకోర్ట్ నియమించిన జూడిషియల్ అధికారి సమక్షంలో ఈ వైద్య పరిక్షలు నిర్వహిస్తారు.

ఈ వైద్య పరిక్షలకు సంబంధించి ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. రిపోర్ట్ ని సీల్డ్ కవర్ లో ఆస్పత్రి వర్గాలు సుప్రీం కోర్ట్ కి పంపిస్తాయి. ఇక రఘురామ కృష్ణం రాజు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఆర్మీ ఆస్పత్రి వద్ద భద్రతను పెంచారు.

Read more RELATED
Recommended to you

Latest news