బంగారం లాగే వెండి కూడా.. భారీగా పెరిగిన ధర!

-

న్యూఢిల్లీ:  దేశంలో బంగారం ధరలు పెరిగాయి. నిన్నతో పోల్చుకుంటే ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.44 వేలకు చేరుకుంది. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.48,000 ధరకు చేరుకుంది. మరో వైపు ఈ రోజు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.74,100కి చేరుకుంది. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.526 పెరిగి రూ.46,310 ధరకు చేరుకుంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,778 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంటే, ఔన్స్ వెండి ధర 26.25 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు బలహీనపడి 74.37కి చేరుకుంది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, రూపాయి బలహీనపడటంతో బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో బంగారం ధర:

Read more RELATED
Recommended to you

Latest news