పెరిగిన బంగారం ధరలు ..!

-

బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు అమాంతం పెరగడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 70 రూపాయల పెరిగి… 40,030 రూపాయలుగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 50 రూపాయల పెరిగింది.

దీనితో 43,030 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల ధర… 70 రూపాయల పెరిగింది. 40,030 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలకు పెరగడంతో 44,030 రూపాయలకు చేరుకుంది బంగారం ధర. వెండి ధరల విషయానికి వస్తే 40 వేలు దాటింది. వెండి ధర 40,360 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే అక్కడ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయలు పెరిగింది. 44,260 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయలు పెరగడంతో 41,960 రూపాయల వద్దకు చేరింది. 40 వేల మార్కు దాటి కేజీ వెండి ధర 40,360 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news