మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

-

ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా…. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. భూమిపైనే అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు కాస్త పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 52,460 గా నమోదు కాగా…. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయి… రూ. 47,950 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా స్థిరంగా నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ.71,300 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news