డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..నేడు అకౌంట్ లోకి డబ్బులు..!

-

డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైయస్సార్ ఆసరా పథకం రెండో విడత మొత్తాన్ని ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ లో సభ్యులుగా ఉన్న మహిళల ఖాతాలో వేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7.92 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్ల రూపాయలు పంపిణీ కానున్నాయి.

Jagan
Jagan

ఇక ఈ పథకం ద్వారా ఇచ్చే డబ్బులను ఎలాంటి ఆంక్షలు లేకుండా మహిళలు వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 8 నుండి 17 వరకు పది రోజుల పాటు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక మండలంలో వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించబోతున్నారు. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. పంపిణీ జరిగే ప్రాంతంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం ఓ మీటింగును కూడా ఏర్పాటు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news