ప్రభాస్ – ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. జోడి కుదిరేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు అనేవి ఈరోజు కొత్తవేం కాదు. ఎన్టీఆర్z ఏఎన్ఆర్ కాలం నుంచే ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి. చాలా కాలం గ్యాప్ తీసుకొన్న తర్వాత రాజమౌళి.. ప్రభాస్ , రానాతో బాహుబలి సినిమాను తెరికెక్కించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అసలు సిసలు మల్టీ స్టారర్ మజా ఏంటో చూపించారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ కి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారం కూడా ఇండస్ట్రీలో బాగా జరుగుతుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈయన వరుసగా సలార్ , ప్రాజెక్టు కే, ఆది పురుష్ వంటి క్రేజీ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని తన నటనతో అందరిని కట్టిపడేశాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేసి ఆ తర్వాత కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఇంతటి నేషనల్ వైడ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్, ఎన్టీఆర్ లతో ఒక సినిమా చేయాలి అని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఇదే విషయాన్ని ఉమైర్ సందు ట్వీట్ చేయడంతో ఇది కాస్త బాగా వైరల్ గా మారుతుంది. ఇక తన దగ్గర ఎటువంటి సమాచారం లేకపోయినా కేవలం అటెన్షన్ కోసం ఇలాంటి ట్వీట్స్ చేస్తుంటాడని కొంతమంది ఆయన మాటలను కొట్టి పడేస్తుండగా.. మరి కొంతమంది మాత్రం నిజంగా ఈ కాంబినేషన్ వస్తే అభిమానులకు పండగే అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news