తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

-

తెలంగాణ విద్యుత్తు ఉద్యోగులకు శుభవార్త. విద్యుత్తు ఉద్యోగులకు త్వరలోనే కొత్త వేతన సవరణ ఒప్పందం అమలు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.

వేతన సవరణ ఒప్పందం అమలు గడువు గత మార్చితో ముగిసినందున వెంటనే కొత్త పిఆర్సి అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ నేతలు శనివారం మంత్రి కార్యాలయంలో జగదీశ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ట్రాన్స్ కో, జన్ కో సీఎం డి ప్రభాకరరావు, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి రఘురామరెడ్డిలకు కూడా జేఏసీ ఈ సందర్భంగా పిఆర్సి అమలు చేయాలని విన్నవించింది. సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎం కేసీఆర్ తో మాట్లాడి వారం రోజుల్లో పిఆర్సిపై ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news