ఏపీలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త.. లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుంది. వీరి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేసేందుకు ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 4 శాతం వడ్డీకే రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు.

పిల్లల చదువులో వచ్చే ఖర్చులను తగ్గించడమే దీని లక్ష్యం. కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులని సమాచారం. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు… చంద్రబాబు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు 2000 కు… రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి మొత్తం 7000 రూపాయలు జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో రెండో విడత అలాగే వచ్చే జనవరిలో మూడో విడత జమ చేస్తారని సమాచారం అందుతుంది. పీఎం కిసాన్ డబ్బు జమ తేది మారితే అనుగుణంగా ఆ డేట్ కూడా మారే అవకాశం ఉంది. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలను గుర్తించింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.