తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక పై హుండీ లెక్కింపు చూడొచ్చు !

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో మరో పరకామణిలో లెక్కింపు ప్రారంభమైంది. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరాకమని భవనంలో ఆదివారం ఉదయం నుంచి లెక్కించడం మొదలుపెట్టారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న నూతన పరకామణి భవనంలో ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూతన పరకామణి భవనంలో వాస్తు హోమం, గోపూజ, శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుంచి తీసుకుని వచ్చిన హుండీ కానుకలను వేరు చేయడం, లెక్కించడం ప్రక్రియను ప్రారంభించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తులు స్వామి వారికి సమర్పించే కానుకల లెక్కింపు స్వయంగా వీక్షించే విధంగా భవనంకు నలువైపులా అద్దాలు ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ నూతన పరకామణి భవనంలో సిబ్బందికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news