గ్రామ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..పిల్లనిచ్చేందుకు పోటీ..

-

ఏపీ సర్కారు ఇటీవల ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.1.30 లక్షలకు పైగా ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేయడమే కాకుండా.. కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులందరికీ ఆగస్టులో తీసుకునే జూలై నెల జీతాలు పెరగనున్నాయి. కొత్త పే స్కేల్ ప్రకారం గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులకు రూ.25 వేల నుంచి రూ.27వేలు, వార్డు సచివాలయాల్లోని వారికి దాదాపు రూ.31వేల వరకు జీతాలు వచ్చే అవకాశమున్నట్లు లెక్కలు వేసుకుంటున్నారు. దాదాపు 9 నెలల నిరీక్షణ తర్వాత ఉద్యోగాలు పర్మినెంట్ కావడంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు అవ్వడంతో సంతోషం లో మునిగి తేలుతున్నారు..

ఇకపోతే వారి సంతోషానికి మరో కారణం కూడా ఉంది.జీతాలు పెరగడం, ఉద్యోగం పర్మినెంట్ కావడం ఒక ఎత్తయితే.. ప్రొబేషన్ ఖరారు కాకపోవడంతో చాలా మందికి పెళ్లిళ్లు సందిగ్ధంలో పడ్డాయి. గతేడాది నవంబర్ లో ప్రొబేషన్ ఖరారయ్యే సమయంలో ఉద్యోగుల్లో చాలామంది పెళ్లిళ్లు సందిగ్ధంలో పడ్డాయి. ఉద్యోగం పర్మినెంట్ కాకపోవడంతో సచివాలయ ఉద్యోగులకు పిల్లనిచ్చేవారు ఆలోచించాల్సిన పరిస్థితి. కొందరికైతే పర్మినెంట్ అయ్యాక చూద్దాంలో అనే పరిస్థితి ఎదురైంది. జీతం రూ.15వేలే ఉండటం, పర్మినెంట్ కాకపోవడంతో వారికి పిల్లనిస్తే సుఖపడుతుందా అని అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. వేలాది మంది పెళ్లిళ్లు ప్రొబేషన్ తో ముడిపడి ఉండటంతో యువకులకు ఆందోళన తప్పలేదు.

ఉద్యోగం పర్మినెంట్ కావడంతో సచివాలయాల్లోని పెళ్లికాని ప్రసాదులంతా ఎగిరి గంతేస్తున్నారు. అప్పట్లో రూ.15వేల జీతముంటే కట్నం సంగతి దేవుడెరుగు.. కనీసం పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని.. ఇప్పుడు జీతం పెరిగింది.. జాబ్ పర్మినెంట్ అయింది కాబట్టి సంబంధాలు క్యూ కడతాయని భావిస్తున్నారు..అయితే వచ్చే నెల నుంచి సచివాలయ ఉద్యోగుల ఇళ్లల్లో పెళ్ళి భాజాలు ఎక్కువగా మోగనున్నాయి.కొన్నిచోట్ల సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులనే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి..మొత్తానికి జగన్ వారికి ఉద్యోగం తో పాటు జీవితాన్ని కూడా ఇచ్చారని ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news