21 ఏళ్లు దాటిన మహిళలకి గుడ్ న్యూస్.. రూ. 2 లక్షల రుణాన్ని ఇలా పొందండి..!

-

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మహిళలకి అదిరే వార్త ఇది. సులభంగానే రుణం పొందొచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేవలం మహిళలకు మాత్రమే రుణాలు అందించే సంస్థ ఒకటి ఉంది. దీని పేరు మహిళా మనీ. అర్హత కలిగిన మహిళలు సులభంగా లోన్ ని తీసుకొచ్చు. పైగా దీని కోసం మీరేమి కష్టపడక్కర్లేదు.

కేవలం ఇంట్లో వుండే ఈజీగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. 21 ఏళ్ల వయసు దాటిన మహిళలు ఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. భారతీయ పౌరులు అయ్యి ఉండాలి. రూ. 2 లక్షల వరకు లోన్ ని తీసుకోవచ్చు. ఇక వడ్డీ రేటు గురించి చూస్తే.. వడ్డీ రేటు 20 శాతంగా ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 6 నెలలు నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితితో రుణం పొందొచ్చు.

ఈ లోన్ ని ప్రతి నెలా ఈఎంఐ రూపంలో కట్టాలి. మహిళా మనీ రుణాలు అందించడానికి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో కస్టమర్లకు పర్సనల్ లోన్స్ ఇస్తోంది. మహిళా మనీ ప్లాట్‌ఫామ్ ద్వారా పేపర్‌లెస్ పద్ధతిలో రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. పైగా దీని కోసం ఏ తనఖా పెట్టాల్సిన పని లేదు.

రుణం కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు మహిళా మనీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. అక్కడ ఎంఎం లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. తర్వాత అప్లై లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి రుణం కోసం అప్లై చెయ్యచ్చు. లోన్ తీసుకునే వారు చార్జీల విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. రుణాలపై 2 శాతం ప్రాసెసింగ్ ఫీజు కలెక్ట్ చేస్తోంది. అయితే ఈఎంఐ ని సరైన టైం కి చెల్లించకపోతే పెనాల్టీ పడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news