GOOD NEWS: ఆగస్టు 15 నుండి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణీ …

-

కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చుకునే దిశగా కేసీఆర్ సాగుతున్నాడు. తాజాగా ఒక కీలక ప్రకటన ప్రభుత్వం నుండి వెలువడింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కొన్ని హామీలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అన్నది పెద్ద ప్రజలకు ఎంత కీలకమైనదో తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వీటిని ఆగష్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఈ వార్తను విన్న లబ్ధిదారులు సంతోషంలో మునిగితేలుతున్నారు. కాగా ఈ లక్ష మందిలో అదృష్టవంతులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇంకా కేటీఆర్ గృహలక్ష్మి పధకం గురించి కూడా ప్రస్తావించారు.

ఈ పధకం ద్వారా ఒక్కొక్క లబ్ధిదారునికి రూ. 3 లక్షలు అందుతాయని చెప్పారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలియచేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news