రాజాసింగ్ పై పీడి యాక్ట్ నమోదును నిరసిస్తూ చేపట్టిన గోషామహల్ బంద్ ప్రశాంతం

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అక్రమ కేసుల ఉపసంహరణతో పాటు ఆయనని జైలు నుంచి విడుదల చేయాలని శ్రీరామ్ యువసేన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శ్రీరామ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ నేడు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం బందుకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్, ముక్తార్ గంజ్, బేగంబజార్, ఉస్మాన్ షాహి, అశోక్ బజార్, గౌలిగూడ, ఫిష్ మార్కెట్, సుల్తాన్ బజార్, బడి చౌడీ, తదితర మార్కెట్లలోని వ్యాపారులందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బందుకు సంపూర్ణంగా మద్దతు పలికారు. దీంతో గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని చౌరస్తాల వద్ద ఎక్కడ చూసినా రోడ్లు నిర్మానుషంగా మారాయి. మొత్తం మీద గోషామహల్ నియోజకవర్గం బంద్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news