ధోనీ కోసం 2400 కిలోమీటర్లు … ఢిల్లీ నుండి చెన్నై కు సైకిల్ ప్రయాణం!

-

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత ఐపిఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా ధోనీ ని కలవడానికి మరో ఫ్యాన్ తీసుకున్న నిర్ణయం ఎందరినో షాక్ కు గురి చేస్తోంది. ఢిల్లీ కి చెందిన ఫేమస్ యూ ట్యూబర్ గౌరవ తనేజాకు ధోనీ అంటే అమితమైన ప్రేమ ఇష్టం. అయితే ఈయనను ఎలాగైనా కలవాలన్న కసితో ఢిల్లీ నుండి చెన్నైకు సైకిల్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు.దాదాపుగా ఢిల్లీ నుండి చెన్నై కు సైకిల్ పై 2400 కిలోమీటర్లు ప్రయాణం అంటే ఆషామాషీ విషయం కాదు. కానీ గౌరవ తనేజా ఈ అసాధ్యమైన కార్యాన్ని తలపెట్టాడు. ప్రస్తుతం మార్గమధ్యంలో వెళుతున్న తనేజా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఇది తెలిసిన వారు అంతా హవ్వ ఇంత ఇష్టం ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news