ఏకంగా ప్రభుత్వ అధికారినే కుల బహిష్కరణ చేసారు…!

-

జనగామ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జనగామ మండలం యశ్వంతపూర్ లో వీఆర్వో పై కులబహిష్కరణ వేటు వేసారు కొందరు. తన తండ్రి ద్వారా సంక్రమించిన వీఆర్ ఏ ఉద్యోగం కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసారు పాలివాళ్లు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు పేర్కొన్నాడు. కుల బహిష్కరణ తో పాటుగా శిరోముండనం చేయాలని అనాగరిక తీర్పు ఇచ్చారు.

ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం అందింది. మీడియాలో ప్రధానంగా హైలెట్ కావడం, బాధితుడు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఉన్నతాధికారులు ఆరా తీసారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీఆర్వో నుంచి ఫిర్యాధుని అందుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమావేశం మీడియాకు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news