అచ్చెన్నాయుడు ఆంబోతులా ఉన్నాడు – ప్రభుత్వ విప్ కోరుమట్ల

-

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనపై ప్రభుత్వ విప్ కోరుమట్ల శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులకు సభా మర్యాదలు, స్పీకర్ కు ఇవ్వాల్సిన గౌరవం కూడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తల వంచుకునేలా ఉందన్నారు కోరుమట్ల శ్రీనివాసులు. రోజూ సస్పెండ్ చేయించుకుని బయటకు వెళ్లి ఏం చేస్తున్నారో దేవుడికి తెలియాలని ఎద్దేవా చేశారు.

అచ్చెన్నాయుడు ఆంబోతులా ఉన్నాడని.. టీడీపీ సభ్యులను టర్మ్ అంతా సస్పెండ్ చేసినా తప్పు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం లేకుండా తీర్మానం చేయాలన్నారు. లేదంటే వీరు మారరని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లో శాసనసభను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు వీరికి పట్టవని టిడిపి సభ్యులపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్ కోరుమట్ల శ్రీనివాసులు.

Read more RELATED
Recommended to you

Latest news