అయోధ్యకు చేరిన 613 కిలోల గంట…!

-

రామజన్మభూమి అయోధ్య ఆలయం కోసం తమిళనాడులోని రామేశ్వరంలో సిద్ధంచేసిన 613 కిలోల గంట బుధవారం అయోధ్యకు చేరింది. కంచుతో తయారైన ఈ భారీ గంటను మోగిస్తే ఓం అన్న శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన భక్తురాలు రాజ్యలక్ష్మి ప్రత్యేక వాహనంలో గంటను అయోధ్యకు తీసుకొచ్చి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అందించారు.

ఈ గంటను భవ్య రామమందిరంలో ఏర్పాటుచేస్తామని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. రాముడి ఆలయానికి గంటను బహూకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ మహత్తర కార్యంలో తనకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు భక్తురాలు రాజ్యలక్ష్మి.

Read more RELATED
Recommended to you

Latest news