కంటి వెలుగు : ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల

-

కంటి వెలుగు కార్యక్రమం అమలు కోసం తెలంగాణ వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కంటి వెలుగు కార్యక్రమం అమలులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది వైద్యారోగ్య శాఖ. నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగింత, ఇంటర్ వ్యూ పద్దతిలో నియామకాలు చేపట్టనుంది.

డిసెంబర్ 1 వ తేదీన నోటిఫికేషన్, 5 వ తేదీన ఇంటర్ వ్యూ, 10 వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు -2 ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. ప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది వైద్యారోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news