టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ టైటాన్స్‌

-

ఐపీఎల్ సీజన్ 2022 రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. అయితే.. నేడు ముంబాయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా.. గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, కేవలం ఒక్క ఓటమితో ఎదురులేకుండా దూసుకెళ్తున్న గుజరాత్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మరి పంజాబ్‌ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది చూడాలి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన.. గుజరాత్ జట్టు 9 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సుదర్శన్‌ 10, మిల్లర్‌ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా రిషి ధవన్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news