తోటలోకి తీసుకెళ్లి ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం..

-

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు.. తమ కామవాంఛ తీర్చుకోవడానికి.. ఎలాంటి మార్గనైనా ఎంచుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. తాను పోలీసునని బెదిరిస్తూ.. ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారానికి ఒడిగట్టాడు.. ఈ ఘటన.. విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఒట్టిగెడ్డ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థినులు, మరో ఇద్దరు విద్యార్థులు మొత్తం నలుగురు ఒట్టిగెడ్డ రిజర్వాయర్‌కు విహార యాత్రకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో నడుచుకుంటూ వస్తుండగా రాంబాబు వారిని అటకాయించాడు. తోటలోకి తీసుకెళ్లి బెదిరించాడు. ఇద్దరు విద్యార్ధులను అక్కడే కూర్చొబెట్టారు.

మిగిలిన ఇద్దరు విద్యార్థినులను సమీపంలోని ఫామ్ ఆయిల్ తోటలోకి తీసుకెళ్లి వారిపై అత్యాచారం చేశాడు. దీంతో.. రాత్రి జూనియర్ కళాశాలకు చేరుకున్న విద్యార్థులు జరిగిన ఘటనను కళాశాల సిబ్బందికి వెల్లడించడంతో.. బాధిత విద్యార్థినులతో కలిసి కళాశాల సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు రాంబాబును అదే రాత్రే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాంబాబు గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది..

 

Read more RELATED
Recommended to you

Latest news