Gujrat: బీజేపీలో చేరిన 200 మంది కాంగ్రెస్ నేతలు

-

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది.గుజరాత్‌లో 200 మంది కాంగ్రెస్ నేతలు బీజేపి పార్టీలో చేరారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ… కాంగ్రెస్‌కు మూలస్థంభాలు, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు అని తెలిపారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవలా కనిపిస్తుంది, ఆ పార్టీ విభజన కుల రాజకీయాలపై మాత్రమే దృష్టి సారిస్తుందని అన్నారు.ప్రస్తుతం గుజరాత్‌ లో కాంగ్రెస్‌ పార్టీకు నాయకత్వం లేక పోవడంతో ఇక్కడ దాని ఉనికి క్షీణిస్తున్న క్రమంలో మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాము, దేశ నిర్మాణం కోసం వారితో కలిసి నడుస్తామని నాయకులు వెల్లడించారు.

పురుషోత్తమ్ రూపాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు బీజేపీకి పూర్తి మద్దతు అందిస్తామని తెలిపినట్లు వెల్లడించారు. అంతకుముందు మే 4న, రాజ్‌కోట్ మాజీ మేయర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ దంగర్, బీజేపీ ప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ భరత్ బోఘ్రా, పురుషోత్తమ్ రూపాలా సమక్షంలో అధికారికంగా బిజెపి పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news