హైదరాబాద్ లో దారుణం… బాలికపై అత్యాచారం చేసి… తర్వాత

-

అత్యాచారాల విషయంలో తెలంగాణాలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక విధంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దిశా ఘటన తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలు చూసి కూడా కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రజల్లో కూడా ఆందోళన అనేది ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన కన్నీరు పెట్టిస్తుంది.

rape
rape

శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసి… అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసాడు ఒక యువకుడు. నిందితుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన గోపి గా అధికారులు గుర్తించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. నా దగ్గర గన్ వుంది నీ తల్లిదండ్రులను కాల్చేస్తానంటూ బెదిరించి అఘాయిత్యానికి అతను పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. విషయం బయట పడడంతో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అతని వద్ద గన్ ఉందా లేదా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిని కోర్ట్ లో హాజరు పరచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news