బిగ్ బ్రేకింగ్; నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు…!

-

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఉరి శిక్ష అమలు చేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ కి తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేసారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన పవన్ జలాద్ వారిని ఉరి తీసారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసే ప్రాంతాన్ని అధికారులు పక్కాగా పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తి అయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన 8 ఏళ్ళ తర్వాత ఉరి శిక్షను అమలు చేసారు.

ఉరి కంభం వద్ద 48 మంది భద్రతా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసారు. జైలు నెంబర్ 3న నలుగురు నిందితులను ఉరి తీసారు అధికారులు. ఒక్కో దోషి వద్ద 12 మంది గార్డులు ఉన్నారు. ఉదయం నాలుగు గంటలకు అల్పాహారం పెట్టి, వారికి వైద్య పరిక్షలు నిర్వహించారు. శిక్షకు ముందు వినయ్ శర్మ భోరున విలపించాడు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు నిందితులు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేసారు.

నలుగురు నిందితులను ఒకే సారి ఉరి తీసారు. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అర గంట వరకు నిందితులు ఉరి కంభాలకు వేలాడారు. నిందితులను ఉరి తీయడంతో తీహార్ జైలు బయట మహిళలు, సామాజిక కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిర్భయ తల్లి తండ్రులు కూడా హర్షం వ్యక్తం చేసారు. ఇన్నాళ్ళకు తమ అమ్మాయికి న్యాయం జరిగిందన్నారు. ఇక వారికి శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news