కశ్మీర్ పై పాక్ జూమ్‌ మీటింగ్‌..మధ్యలో హనుమాన్ పాటలు…!

-

కాశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌ను హ్యాక్‌ చేశారు భారత అనుకూల హ్యాకర్లు.. దాయాది దేశానికి గట్టి షాక్‌ ఇచ్చారు. సమావేశం మధ్యలో రాముడు, హనుమంతుడి పాటలను ప్లే చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. భారత్‌లో ఉన్న కశ్మీర్‌ భూభాగంపై చర్చించేందుకు పాకిస్తాన్‌ ప్రపంచవ్యాప్తంగా కొంతమందితో జూమ్‌ మీటింగ్‌ను నిర్వహించింది. సమావేశం మొదట హనుమంతుడి పాట ప్లే అయ్యింది.

47వ నిమిషంలో మళ్లీ రెండోసారి సమావేశం హ్యాక్‌ అయ్యింది. ఈ పాట సుమారు 2 నిమిషాలు ప్లే అయ్యింది. ఈ పాట వస్తున్నప్పుడు డాక్టర్ వలీద్ మల్లిక్ తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయమని పదేపదే అభ్యర్థించాడు. ఇది జరుగుతుందని ముందే ఊహించానని మరొక వక్త పేర్కొన్నాడు. ఈ వీడియో ట్విట్టర్‌లో హల్‌చల్‌చేస్తోంది. నెటిజన్లు సరదా కామెంట్లు, మీమ్స్‌తో పాక్‌ను ఆడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news