మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ దంపతులకు కరోనా పాజిటివ్

-

థర్డ్ వేవ్ లో కరోనా ప్రముఖులను వెంటాడుతోంది. వరసగా పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు, స్పోర్ట్స్ పర్సన్లకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. హర్భజన్ తో పాటు ఆయన భార్య గీతా బస్రాకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని బజ్జీ భార్య గీత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ వైరస్ నుంచి రెండేళ్లుగా తప్పించుకునేందుకు ప్రయత్నించాం… అయినా మమ్మల్ని పట్టుకుంది అంటూ ట్విట్టర్ లో రాసుకోచ్చింది. మరోవైపు బజ్జీ తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యానని.. నాతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు.

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య 3.5 లక్షలను దాటింది. మరోవైపు ఓమిక్రాన్ కూడా విస్తరింస్తోంది. దీంతో ప్రజల్లో కాస్త ఆందోళన నెలకొంది. థర్డ్ వేవ్ లో ఎక్కువగా ప్రముఖులు కరోనా బారిన పడటం వారి ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news