వైఎస్‌ వారసులకి ఇక్కడ స్థానంలేదు : షర్మిలకు హరీష్‌రావు కౌంటర్

-

వైఎస్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలు హృదయాలలో వైఎస్ వారసులకు స్థానం లేదని.. నేను బతికి ఉండగా తెలంగాణ రాదని రాజశేఖర్ రెడ్డి చెప్పాడని మం డిపడ్డారు. కొత్త, కొత్త పార్టీలు వచ్చాయి, పోయాయి..తెలంగాణ ఇవ్వడానికి ఏమైనా సిగరెటా, బీడీనా అని రాజ శేఖర్ రెడ్డి అసెంబ్లీ లో అన్నాడని నిప్పులు చెరిగారు. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా ? అని ప్రశ్నించారు.

తెలంగాణను అవమానం, అపహేళన చేసింది రాజశేఖర్ రెడ్డి అని.. ఫైర్ అయ్యారు. రాయల తెలంగాణ కావాలని.. ప్రత్యేక తెలంగాణను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని.. 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే తెలంగాణ అని రాజశేఖర్ చెప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ఎక్కువ, ప్రజలలో తక్కువ అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని.. కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదని చురకలు అంటించారు. జులై నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని.. త్వరలో 4 వేల కోట్లతో పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లక్ష 30 వేలు ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news