కాంగ్రెస్ ముసుగులో.. తెలంగాణకు చంద్రబాబు : హరీశ్ రావు

-

టిడిపి అధినేత చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వస్తున్నాడని… చంద్రబాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ధరలు పెంచింది తప్ప దేశానికేం చేసిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంద్రాబాబు అని ప్రజలు వెల్లగొట్టారని గుర్తు చేశారు హరీష్ రావు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు

 

టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఎవరు.. ? ఓటుకు నోటు కేసులో ఉన్నవాళ్లే కదా అని చెప్పిన ఆయన.. చంద్రబాబు కు అత్యంత‌ సన్నిహితుడైన రేవంత్ .. ఇప్పుడు పీసీసీ‌ చీఫ్ గా వచ్చాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నాక.. పొలాల్లో నీళ్లు, ఇంటింటికీ తాగునీళ్లు వస్తున్నాయన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని పని టీఆర్ఎస్ చేసిందని స్పష్టం చేశారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news