ఆ శకునులే మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు : హెచ్​డీ కుమారస్వామి

-

తమ కుటుంబంలో చీలికలు తెచ్చేందుకు కొందరు శకునులు ప్రయత్నిస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ పక్కన చేరి ఆయనకు బ్రెయిన్‌ వాష్‌ చేస్తున్న శకునులు ఎవరో తనకు తెలుసన్నారు. తన తండ్రి దేవేగౌడ కూడా తన సోదరుడి మనసు మార్చలేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

తన భార్య భవానీకి హాసన నుంచి టికెట్‌ ఇవ్వకపోతే ఆ స్థానంతో పాటు, హొళెనరసీపుర నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ కోరిన విషయం తనకు తెలియదని కుమారస్వామి చెప్పారు. హాసన నుంచి పోటీకి తన వదిన భవానీ ఏడాదిన్నర కిందటే కోరగా నిరాకరించానని తెలిపారు. హాసన నుంచి పార్టీ కార్యకర్త స్వరూప్‌ను పోటీకి దించుతామని స్పష్టం చేశారు.

అభిమానులు, శ్రేయోభిలాషుల పేరిట బయటి వ్యక్తులే తమ కుటుంబంలో చిచ్చు పెడుతూ, హాసన సీటు కోసం పట్టుబట్టాలని రేవణ్ణకు నూరిపోస్తున్నారని విమర్శించారు. మా కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకే బయటి వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు.

Read more RELATED
Recommended to you

Latest news