ఏపీలో ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

-

వేణు స్వామి… ఈ పేరు సంచలనాలకు మారుపేరు. ఎప్పుడు ఏదో ఒక దానిపై సంచల వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో జ్యోతిష్యుడు వేణు స్వామి వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకి సంబంధించి ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలుస్తది అనే విషయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

లక్ష సర్వేలు వచ్చినా.. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు మూడేళ్ల పాటు సైలెంట్‌గా ఉండాలని సలహా ఇచ్చానని తెలిపారు. చివరి రెండేళ్లలో మాత్రమే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని చెప్పానంటూ ఆయన గుర్తు చేశారు. జగన్ సీఎం కుర్చీలో కుర్చుంది మొదలు.. ప్రభుత్వం పడిపోతుందంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందని అదే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ అయ్యిందని అన్నారు. ఎన్నికల 2 నెలల ముందు కూడా టీడీపీకే గెలిచే అవకాశం ఉందని, ఆ పార్టీ మరో రెండు పార్టీలతో జత కట్టడం వల్లే సీన్ మొత్తం మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news