నారా లోకేశ్‌ పాదయాత్రలో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

-

తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ పాదయాత్ర ఏపీలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన మరువక ముందే మరో విషాదం నారా లోకేష్ పాదయాత్రలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా ఐరాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం రమేష్… నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురై.. గుండెపోటు బారిన పడ్డాడు. లోకేష్ పాదయాత్రలో కాస్త ఉద్రిక్తత నెలకొనడంతో… అదే సమయంలో రమేష్ కు గుండెపోటు రావడం గమనార్హం. దీంతో రమేష్ అక్కడే మృతిచెందాడు.

మరోవైపు లోకేశ్ పై మరో క్రిమినల్ కేసు నమోదయింది. చిత్తూరు నర్సింగరాయపేట పీఎస్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 341, 290 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సమా వేశాన్ని నిర్వహించారని, పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news