తెలంగాణలో సూర్యుడి సెగతో ప్రజలు అల్లాడుతున్నాడు. నిప్పులు కురుస్తున్న ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. రోజురోజు గరిష్ఠ ఉష్టోగ్రతలు పెరిగిపోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదవుతాయని వెల్లడించారచు.
ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసిన అధికారులు మధ్యాహ్న సమయంలో అసలు బయటకు వెళ్లొద్దని సూచించారు. ఈ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. 24, 25 తేదీల్లో ఉమ్మడి అదిలాబాద్తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.