జంట జలాశయాలకు భారీ వరద ప్రవాహం

-

హైదరాబాద్​లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వానకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. పనులపై బయటకు వెళ్లే వారంతా ఇబ్బందులు పడుతున్నారు.


ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్​సాగర్​కు వరద ప్రవాహం పోటెత్తింది. ఉస్మాన్​సాగర్ పూర్తి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,787 అడుగుల మేర నీరు నిలిచింది. ఉస్మాన్​సాగర్ జలాశయానికి ప్రస్తుతం 1,200 క్యూసెక్కులు ఇన్​ఫ్లో ఉంది.

హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 325 క్యూసెక్కుల నీరు చేరుతోంది. హిమాయత్‌సాగర్ నుంచి మూసీలోకి 330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,760.70 అడుగుల మేర నీరు చేరుతోంది.

హుస్సేన్‌సాగర్​లోకి భారీగా వరద నీరు చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం పూర్తిస్థాయి దాటింది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా .. ప్రస్తుత నీటిమట్టం 513.45 మీటర్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news