హుజూర్ నగర్ లో భారీ వర్షం.. కేసీఆర్ సభపై..

-

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ సభ కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సాయంత్రం 4గంటలకు హుజూర్ నగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. దీంతో హుజూర్‌నగర్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేశారు. ఇక ఈ సభ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదు నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు.

అయితే, హుజూర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, సభ జరుగుతుందా? లేదా? అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్ కు ముందు హుజూర్ నగర్ లో కేసీఆర్ ప్రచారానికి కూడా వర్షం అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా కేసీఆర్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఈరోజు మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news