ఆస్పత్రిలో చేరిన హీరో అడవి శేషు.. !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడవి శేషు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యం లోనే ఇవాళ ఉదయం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. హైదారబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి అన్నట్లు గా సమాచారం అందుతోంది. హీరో అడవి శేషు కు డెంగ్యూ వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.

అయితే.. డెంగ్యూ వైరస్‌ సోకినట్లు…. ఇంకా అధికారికంగా వైద్యులు ప్రకటించలేదు. రెండు రోజుల నుంచి అడవి శేషు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో నే ఆస్పత్రి లో చేరారని సమాచారం అందుతోంది. ఈ విషయం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం హీరో అడవి శేషు…. మేజర్‌ అనే పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడు. విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను కనివిందు చేసే… అడవి శేషు… ఈ సినిమా లో మేజర్‌ పాత్రలో కనిపించనున్నారు. 26/11 ముంబై టెర్రర్‌ అటాక్‌ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news