నిఖిల్: 18 పేజెస్ విడుదల కంటే థియేటర్స్ పెరిగాయి.!

-

నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్‌  హీరోయిన్ గా  ’18 పేజెస్‌’. సినిమా పోయిన శుక్రవారం విడుదల అయిన సంగతి తెలిసిందే. దిగ్గజ  దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ వచ్చి సందడి చేయడం తో మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది.

అలాగే నితిన్ కార్తికేయ 2, సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై చాలా అంచనాలు నెలకొన్నాయి. కాని ఆశించినంత కలెక్షన్ రావటం లేదు. ఒక పక్క అప్పుడే రిలీజ్ అయిన ధమాకా కలెక్షన్స్ అదుర్స్ అనిపిస్తూ దూసుకు పోతూ ఉంటే ’18 పేజెస్‌’ లో ఆ జోష్ లేదు. కాని ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ కూడా సక్సెస్ మీట్ లో మాట్లాడారు. ఫీల్ గుడ్ సినిమా ఆడదు, లవ్ స్టోరీస్ ఇంటికొస్తాయి అవి చూసుకుంటాం ఇలా అనుకున్న తరుణంలో సీతారామం సినిమా వచ్చి అదరగొట్టేసింది. ఆ సినిమా క్లైమాక్స్ కి ఉన్న ఫీలింగ్ ఈ సినిమాకి వచ్చిందని చాలామంది పోల్చి చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది అని అన్నారు

ఇక హీరో నిఖిల్ మాట్లడుతూ సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది, నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్ కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచివ్మెంట్. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సప్రైజ్ అవుతున్నాను అంటూ కామెంట్స్ చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news