చంద్రబాబు డ్రోన్‌ షాట్‌ కోసమే..కందుకూరులో 8 మృతి – జగన్ సంచలనం

-

చంద్రబాబు డ్రోన్‌ షాట్‌ కోసమే..కందుకూరులో 8 మృతి చెందారని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగునాథుని పాలెం సభలో జగన్ మాట్లాడుతూ, .. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో అభివృద్ధి జరగలేదు.. ఇవాళ రూ.986 కోట్ల పనులకు శంకుస్థాపన చేశానన్నారు. మెడికల్ కాలేజీ వస్తే 150 మెడికల్ సీట్లు వస్తాయి.. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుందని ప్రకటించారు సీఎం జగన్.

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని సీఎం జగన్ నర్సీపట్నంలో విమర్శించారు. మంచి చేస్తున్నా, వాళ్లకు చెడే కనిపిస్తోందని, నిబంధనల ప్రకారం పెన్షన్ల పై ఆడిట్ చేస్తుంటే తొలగిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే అంటూ CM జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news