సీఎం చంద్రబాబుకి త్వరలో నోటిసులు!

-

కేంద్రం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డా శివాజీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజ్యంగ బద్ధ సంస్థ నుంచి సోమవారం నోటీసులు రానున్నట్లు హీరో శివాజీ జోష్యం చెప్పారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి కేంద్రం ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన భాజపా పై నిప్పులు చెరిగారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడ మరో రూపం దాల్చుకుని ఏపీపై దాడికి సిద్ధమైందన్నారు. శుక్రవారం అర్థరాత్రి విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి ఆయనకు ఫోన్ రావడం వల్ల భాజపా కుట్ర తెలిసిందని పేర్కొన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి తొలగించడానికి జాతీయ పార్టీ అదును చూసి దెబ్బకొట్టాలని చూస్తోందని తెలిపారు. సీఎం స్థానంలో జగన్ ఉన్న కూడా నా స్పందనే ఇలాగే ఉంటుందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే తెలుగు వారి గొంతునొక్కాలని భాజపా ప్రయత్నాలు చేయడం చాలా బాధాకరం అన్నారు. హోదా ఇస్తామని చెప్పి ఇచ్చిన మాటను తుంగలో తొక్కిన భాజపా నేతలు ఇక రాష్ట్రంలో పర్యటించి ఏం సాధిస్తారని శివాజీ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news