సరికొత్త నిర్ణయం.. ఆ ఛాలెంజ్‌ స్వీకరించిన సుధీర్ బాబు..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా.. హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో సుధీర్ బాబు ఈ రోజు గండిపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ మొక్కను తన కొత్త సినిమా ‘వి’కు గుర్తుగా నాటానని తెలిపారు. ఇకపై తన ప్రతి సినిమా విడుదలకు ముందు మొక్కను నాటి దానికి ఆ సినిమా పేరు పెట్టుకుంటానని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మొక్కలు నాటితే ఎంతో ఆనందంగా ఉంటుందని సుధీర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news