Samantha: స‌మంత‌ను లైన్లో పెట్టిన సొట్ట బుగ్గ‌ల సుంద‌రి!

-

Samantha : నాటి త‌రం కథానాయకులతో పోల్చుకుంటే నేటి కథానాయకుల‌ తీరే వేరు. నేటీ త‌రం క‌థానాయ‌కులు కేవ‌లం న‌ట‌నకే ప‌రిమితం కాకుండా ప‌లు రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ సొంతం వ్యాపారాలు ప్రారంభించే దిశ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంత మంది హీరోయిన్లు నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. ప్రోడ్యూస‌ర్ రోల్ ప్లే చేయ‌డానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవ చెందిందే హాట్ బ్యూటీ తాప్సి. ఇటీవ‌ల ‘అవుట్‌ సైడర్స్‌ ఫిలిమ్మ్స్‌’ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. స్వంతంగా సినిమాల్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది.

అందులో భాగంగా సమంత ను లైన్ లో పెట్టింద‌ట‌. త‌న‌తో ఓ ప్రాజెక్టు చేయబోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్.
హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీని తెర‌కెక్కించ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌ర్బుస్తున్న‌ట్టు తెలుస్తోంది.
త్వరలోనే అధికారిక సమాచారం రాబోతున్నద‌ట‌. తాప్సి చిత్రంతోనే బాలీవుడ్‌ ప్రయాణానికి స‌మంత శ్రీకారం చుట్టబోతోందని టాక్‌. వారి మ‌ధ్య డీల్ ఓకే అయితే.. సమంత చేసే తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.

మరోవైపు.. చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పుడిప్పుడే సమంత త‌న సీని కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. వరుసబెట్టి సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగులో `శాకుంతలం`, తమిళంలో `కాతువాక్కుల రెండు కాదల్` సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. అలాగే తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు టాక్. ఇక, మ‌రోవైపు బాలీవుడ్ లోని అడుగులు వేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news