కార్తికేయ 2 పై హీరోయిన్ అనుపమ సంచలన వ్యాఖ్యలు

-

మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మూవీలో తన నటనతో కుర్రకారు మనసు దోచేసింది అందాల సుందరి అనుపమా పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘అ..ఆ..’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ భామ ఇటీవల నటించిన కార్తికేయ-2 గ్రాండ్ సక్సెస్ అయింది.  ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ తాను ఆనందంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, ‘నాకెప్పుడూ కూడా స్టేజ్ మీద ఇంత టెన్షన్ ఉండదు. ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా, నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు.

ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కార్తికేయ -2 జర్నీ అయిపోయిందనే బాదే నాకు ఎక్కువగా ఉంది. ఆ బాధ వల్లే నేను ఈ హీట్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు చాన్స్ ఇచ్చినందుకు, నన్ను భరించినందుకు చందు మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు వాళ్ళ వరకు ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు’ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news