ఛార్మీ మైండ్ పోయిందా…? అసలు ఏం మాట్లాడుతున్నావ్…?

-

అసలు ప్రపంచం మొత్తం ఇప్పుడు మహమ్మారి కరోనా మాట వింటే చాలు బహయపడే పరిస్థితి. అసలు ఆ వైరస్ అనగానే చాలా మందిలో ఒక ఆందోళన మొదలయింది. మొన్నటి వరకు చైనాకు పరిమితం అయిన ఈ వైరస్ ఇప్పు 66 దేశాలకు విస్తరించి ఆందోళనకు గురి చేస్తుంది. ఇదేం ఖర్మ రా బాబూ అంటూ ప్రపంచ దేశాలు తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక మన హైదరాబాద్ కి కూడా కరోనా వచ్చేసింది.

దుబాయ్ నుంచి వచ్చిన ఒక ట్రావెలర్ కి కరోనా ఉందని తేల్చారు వైద్యులు. దీనితో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడా కూడా అలసత్వంగా వ్యవహరించడం లేదు ఆరోగ్య శాఖ. ఇప్పుడు దీనిపై ప్రముఖ హీరోయిన్, నిర్మాత ఛార్మి కొన్ని వ్యాఖ్యలు చేసింది. కరోనాకి స్వాగతం అంటూ కామెంట్ చేసింది ఆమె. దీనితో అందరూ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు. ఇది ఏమైనా వేడుకా అంటూ మండిపడుతున్నారు.

ఇలాంటివి ఎందుకు పోస్ట్ చేస్తున్నావ్ తల్లీ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. సినిమాలు సరైన హిట్ కొట్టక మైండ్ బ్లాక్ అయిందా అని, లేక పూరి దెబ్బకు మైండ్ పని చెయడం లేదా అంటూ ఆమె కౌంటర్ ఇస్తున్నారు. ఒక పక్క ఎం చెయ్యాలో అర్ధం కాక జనం చస్తుంటే మధ్యలో నీ హడావుడి ఏంటీ అంటూ ఆమెపై మండిపడుతున్నారు. అవసరమైతే సలహాలు ఇవ్వు లేకపోతే సైలెంట్ గా ఉండు అంతే గాని నీకు అంత అతి అవసరమా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news