నేటి నుంచి 4 రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు.. ఏడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్

-

వేసవి ఎండలు దంచేస్తున్నాయి. మే నెల కూడా రాలేదు.. అప్పుడే సూర్యుడు భగభగలు మొదలపోయాయి. ఉదయం 10 దాటితే ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు మండనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి.

ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్‌, కుమురంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ రంగు సూచికను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో రంగు సూచికను జారీ చేసింది.

మరోవైపు  కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో గురువారం రోజున రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్‌, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగులాంబ-గద్వాల, వికారాబాద్‌, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్‌, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news