తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాలు విడుదల.. ఆధిక్యంలో ఎవరెవరు ఉన్నారంటే ?

-

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంట రేపుతోంది. వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఒక రౌండ్ పూర్తి కాగా రెండో రౌండ్‌ కౌంటింగ్‌ నడుస్తోంది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 4084 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫస్ట్‌ రౌండ్‌లో టీఆర్ఎస్ పల్లాకి : 16130 ఓట్లు, తీన్మార్ మల్లన్న : 12460 ఓట్లు, కోదండరాం : 9080 ఓట్లు, బీజేపీ : 6615 ఓట్లు, కాంగ్రెస్ : 4354 ఓట్లు వచ్చాయి.

ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ స్థానంలో లో మొదటి రౌండ్‌ కౌంటింగ్ కొద్ది సేపటి క్రితమే పూర్హయింది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పూర్తి కాగా ఆ లెక్కల ప్రకారం  టీఆర్ఎస్ 17439, బీజేపీ 16385, నాగేశ్వర్ 8357, కాంగ్రెస్ 5082 ఓట్లు సాధించింది. మొదటి రౌండ్ లో TRS లీడ్ 1054 గా ఉంది. ఇక మొదటి రౌండ్ లో 3374 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఇక ఈ సాయంత్రానికి గెలిచే అభ్యర్థుల మీద క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news